భారత దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్య రంగం ఉందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని నేడు ఆయన ప్రారంభించారు. 70 ఏండ్లు పరిపాలించిన గత ప్రభుత్వాల హయాంలో కుంటుపడిన ఆసుపత్రులను, టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అభివృద్ధి చేసుకుంటున్నామని ఆయన అన్నారు. 18 ఏండ్లు దాటిన వారు తప్పనిసరి కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఒమిక్రాన్ వైరస్ కోసం గజగజ వణుకుతున్నారు.. అది పోవాలంటే మాస్క్ తప్పనిసరి. కేంద్రం నుంచి అనుమతి వస్తే మూడో డోస్ వేసుకుందాం. కరోనా వ్యాక్సిన్ పై అనుమానం, అపోహలు పెట్టుకోవద్దు అని ఆయన అన్నారు.