సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి పిలుపు మేరకు గురువారం హుజూర్ నగర్ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్ చౌరస్తా నందు టిఆర్ఎస్ మహిళ సంఘాల ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా ఖాళీ వంట సిలిండర్లు ప్రదర్శిస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు టిఆర్ఎస్ మహిళ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ చివరికి కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి పేద,నిరుపేద కుటుంబాలను మళ్ళీ కట్టెల పొయ్యి మీద వంట చేసుకునే పరిస్థితి కల్పించిందని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీ పై ఆగ్రహజ్వాలలతో తమ నిరసన ప్రదర్శించారు.అన్ని వర్గాల ప్రజల ఉసురు పోసుకుంటున్న మోడీ ప్రభుత్వం మహిళల,పేద,నిరుపేద,మధ్య తరగతి ప్రజల ఉసురు తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెట్టారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ జిందాబాద్, శానంపూడి సైదిరెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి,నిరంకుశ మోడీ డౌన్ డౌన్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. అనంతరం మహిళలు,మహిళా నేతలు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వ మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ పట్టణ టిఆర్ఎస్ మహిళ సంఘాలు, మహిళా నాయకులు,నియోజకవర్గం లోని అన్ని మండలాల నుండి టిఆర్ఎస్ మహిళ ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్