యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ కోసం నిరంతరం కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆరోగ్య సిబ్బందిని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభినందించారు. కరోనా నియంత్రణకు ప్రాణాలు ఒడ్డిపోరాడుతున్న సిబ్బందికి ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు 100 పిపిఇ కిట్లు అందచేశారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరఫున వీటిని అందచేశామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జిల్లా అవసరం మేరకు ధర్మల్ గన్స్ తెప్పించి కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున త్వరలోనే అందచేస్తామని కూడా ఆయన తెలిపారు. కరోనాపై పోరాటం కేవలం ప్రభుత్వం ఒక్కటే చేసే పని కాదని, ప్రజలు సహకరిస్తేనే దీనిపై పోరాటం చేయగలుగుతామని ఆయన అన్నారు.
ప్రజలందరూ కూడా సమిష్టిగా వ్యక్తిగత దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శుభ్రంగా ఉండాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు. తమ ఫౌండేషన్ సిబ్బంది జిల్లా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.