37.2 C
Hyderabad
May 2, 2024 12: 55 PM
Slider శ్రీకాకుళం

ఘనంగా శంకరంబాడి సుందరా చారి 109వ జయంతి

#Sankarambadi Sundara Chari

శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు తాండ్ర వెంకటరమణమూర్తి అధ్యక్షతన శంకరంబాడి సుందరాచారి గారి 109వ జయంతి వేడుకలు జరిగినవి.

ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ శంకరంబాడి సుందరాచారి ఉపాధ్యాయుడిగా, రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని ఆంధ్ర రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే గేయంలో ప్రముఖమైన నదులను ,సంస్కృతి సాహిత్యాలను, చరిత్రలో ప్రసిద్ధ వ్యక్తులను స్మరిస్తూ ఆ గేయములో పొందుపరిచారని అటువంటి గేయము ఆంధ్ర రాష్ట్రానికే ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పూజారి రవి, బుడుమూరు అప్పలనాయుడు, దాష్టి సుధామణి, బెండి శారద, గొటివాడ సుభద్రా దేవి, పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, రాజనాల సతీష్ రాయుడు, బొంగు వెంకటరమణ, కొణపల శ్రీనివాసరావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

జనతా కర్ఫ్యూ ముందు మాంసం కోసం ఎగబడ్డ జనాలు

Satyam NEWS

ఒక్కమాట విను…

Satyam NEWS

అదర్శ పురపాలికలుగా మార్చాలి

Satyam NEWS

Leave a Comment