వనపర్తి జిల్లా పోలీస్ ఎస్పీ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి 12 మంది ఫిర్యాదుదారులు వచ్చారు. ఫిర్యాదు దారులతో జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని
అదనపుఎస్పీ ఆదేశించారు. అందిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి: 6 భూ ఫిర్యాదులు, 3 భార్యాభర్తల ఫిర్యాదులు, 3 పరస్పర గొడవల ఫిర్యాదులు ఉన్నాయి.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్