స్వాంతంత్ర్య సమరయోధుడు, వైశ్య ప్రముఖుడు, వితరణశీలి కొత్తా వెంకటేశ్వర్లు నిన్న సాయంత్రం మరణించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లోని బూరుగడ్డ గ్రామంలో కొత్తా సత్యనారాయణ, వెంకనరసమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా ఆయన జన్మించారు.
12 సంవత్సరాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఆయన పని చేశారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా, హుజూర్ నగర్ CMS కార్యదర్శిగా, కాంగ్రెస్ నేతగా ఆయన సేవలు అందించారు.
ఎంతో మంది పేద విద్యార్థులను ఆదుకొని వారి ఉన్నతికి పాటుపడి ఇతర దేశాలకు పంపిన మహా మనిషిగా ఎన్ని చెప్పినా తక్కువే ఆ మనీషి గూర్చి. నాటి మంత్రి అక్కిరాజు వాసుదేవరావు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కు ఆయన అత్యంత సన్నిహితుడు.
హుజూర్ నగర్ పట్టణం నడిబొడ్డులో 1984 సంవత్సరం లో 1100 గజాల స్థలాన్ని ఆయన చొరవతో వాసవి భవన్ కొరకు సేకరణ చేశారు. మట్టపల్లి ఆర్య వైశ్య సత్రం 1974 – 1984 వరకు ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించారు. ఆయన ను వైశ్య పితామహుడు గా పిలిచేవారు.
ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మండల పట్టణ ఆర్యవైశ్య సంఘాలు, బూర్లె లక్ష్మీనారాయణ, ఓరుగంటి నరసింహారావు, గుండా రమేష్ Ex.MPTC, పొలిశెట్టి నరసింహారావు, మాశెట్టి అనంత రాములు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు.