40.2 C
Hyderabad
April 29, 2024 15: 47 PM
Slider చిత్తూరు

నారా భువనేశ్వరికి టీసీఎల్ సంస్థ ప్రతినిధుల సంఘీభావం

#narabhuvaneswari

నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి నియోజకవర్గం, వికృతమాల గ్రామం లో TCL సంస్థ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో టీసీఎల్ సంస్థ ప్రతినిధులు భువనేశ్వరిని కలిశారు. సంస్థకు చెందిన జాసన్, అమరేంద్ర, సురేష్ రెడ్డి తమ పరిశ్రమ మీదుగా వెళుతున్న భువనేశ్వరిని కలిసి మద్దతు తెలిపారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టీసీఎల్ సంస్థ ఇక్కడ ఏర్పాటు అయిందని భువనేశ్వరి కి తెలిపారు.

ఈ సందర్భం గా సంస్థకు సంబంధించిన ఉత్పత్తులు, ఉద్యోగుల సంఖ్యపై భువనేశ్వరి సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ హయాంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటు అయిందని, టీసీఎల్ పరిశ్రమ ఈ ప్రాంతానికి రావడం ద్వారా 1500 మందికి ఉద్యోగాలు లభించాయని ప్రతినిధులు భువనేశ్వరికి వివరించారు. పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కంపెనీ ముందు భువనేశ్వరి తో ఉద్యోగులు, ఆ సంస్థ ప్రతినిధులు ఫోటో దిగారు. వేల మందికి ఉపాధి కల్పించే పెద్ద సంస్థ ఈ ప్రాంతం లో ఏర్పాటు కావడం పై భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అరెస్ట్

Satyam NEWS

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో విజయనగరం యూత్ ఫౌండేషన్ భేటీ

Satyam NEWS

ద్వారకా తిరుమలలో ఇక నుంచి ఆన్ లైన్ సేవలు

Satyam NEWS

Leave a Comment