పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడి.. 22 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి.
బస్సు.. సుధోంటి జిల్లా బలోచ్ ప్రాంతం నుంచి పంజాబ్ ప్రావిన్స్లోని రావల్పిండి వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో అకస్మాత్తుగా రోడ్డు నుంచి 500 మీటర్ల లోతులోకి పడిపోయిందని.. పోలీసులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పీవోకే ప్రమాదకరమైన రహదారులతో కూడిన పర్వత ప్రాంతం కావడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.