36.2 C
Hyderabad
May 10, 2024 15: 27 PM
Slider నిజామాబాద్

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు

#rape

కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల లింబూర్ గ్రామానికి చెందిన చంపవార జగదీష్ అనే వ్యక్తికి 20 సంవత్సరాలు జైలు శిక్ష జిల్లా పోక్స్ కోర్టు న్యాయమూర్తి లాల్ సింగ్ శ్రీనివాస నాయక్ తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి, మద్నూర్ మండలంలోని చిన్న టాక్లి గ్రామంలో 2022 సంవత్సరం మార్చ్ 31 నాడు జరిగిన జరిగిన సంఘటనలు ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు రాగా మద్నూర్ ఎస్సై శివకుమార్ కేసు నమోదు

చేశారు అనంతరం సీఐ బిచ్కుంద కృష్ణ , డిఎస్పి బాన్సువాడ జైపాల్ రెడ్డి తదుపరి పరిశోధన చేసి కోర్టులో తగిన సాక్షదారలతో చార్జిషీటుదాఖలు చేయడం జరిగింది. కేసు పూర్వాపరాలు పరిశీలించగా సాక్షులను విచారించి నిందితునికి 20 సంవత్సరాలు జైలు శిక్ష అలాగే పదివేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చినారు.

ఈ కేసులోపబ్లిక్ ప్రాసిక్యూటర్ నంద రమేష్ వాదనలు వినిపించారు. ఈ కేసు నందు నిందితునికి శిక్ష పడడానికి కృషిచేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

జి. లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

కరోనా రోగుల సేవల మై వేములవాడ వాట్సాప్ గ్రూపు

Satyam NEWS

రామ తీర్ధం కొండ‌ రాముల వారి శిరస్సు భాగం లభ్యం

Satyam NEWS

మాట తప్పని మనిషి ఎవరు? ఇంకెవరు ట్రంప్

Satyam NEWS

Leave a Comment