ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం షారుఖ్ మేనేజర్ తో రూ.25 కోట్ల డీల్ కుదుర్చుకున్న కేసులో సామ్ డిసౌజా కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించారు.
ఆర్యన్ ఖాన్ను రక్షించడానికి సునీల్ పాటిల్, కిరణ్ గోసావి ఈ డీల్ మొత్తం రూపొందించారని, ఈ డీల్లో నా ప్రమేయం లేదని సామ్ తెలిపారు. డీల్ కుదిరిన తర్వాత కిరణ్ గోసవి బాడీగార్డ్ ప్రభాకర్ సైల్ షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ నుంచి టోకెన్ మనీగా రూ.50 లక్షలు తీసుకున్నాడు.
ఎన్సీబీ అధికారులతో గోసావిని, మరోవైపు షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీని సంప్రదించినట్లు సామ్ విచారణలో అంగీకరించారు. కానీ ఇంటరాగేషన్లో, సామ్ డిసౌజా ఎటువంటి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తనకు తెలియదని నిర్ద్వంద్వంగా ఖండించారు.