42.2 C
Hyderabad
April 26, 2024 16: 17 PM
Slider విజయనగరం

విజయనగరం జిల్లాలో బయటపడ్డ ఖాకీ లంచం వ్యవహారం….

#policestation

విజయనగరం జిల్లాలో ఖాకీ లంచావతారం వెలుగులో కి వచ్చింది. అదీ శాఖా సిబ్బంది నే స్టేషన్ ఎస్ఐ లంచం అడిగాడన్న ఆరోపణతో రాత్రికి రాత్రే స్టేషన్ ముందే ఆందోళన కు దిగారు… బాధిత బంధువులు. మొరకముడిదాం మండలం బూశాయివలస స్టేషన్ హౌస్ అధికారి…వరకట్న వేధింపుల కేసులు లో భర్త వైపు మొగ్గు చూపి…బాధితురాలని వేధించాడన్నది..బాధిత బంధువుల ఆరోపణ.

లేని పోని ఆరోపణలను బాధితరాలిపై మోపడమే కాగ బలవంతంగా విషపు గళికలు మింగించే యత్నం చేసారని బాధిత బంధువులు ఆరోపిస్తున్నారు. హుటాహుటిన కేసును చీపురు పల్లికి బదిలీ చేయడమే కాకుండా… బాధితురాలిని బలవంతంగా స్టేషన్ కు తీసుకురావడంతో బాధితురాలి బంధువుల్లో ఆగ్రహం పెళ్లుబికి..స్టేషన్ ముందే బైఠాయించారు. విషయం మీడియా తెలియడంతో బాధితుల నుంచీ బేరసారాలకు దిగారు. ఏదైనా జిల్లా పోలీసు శాఖ లో ఈ లంచ వ్యవహారం బట్టబయలు కావడం ఎస్పీ సీరియస్ గానే తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

రాష్ట్రంలో నలుగురు మంత్రులతో మాఫియా

Satyam NEWS

సజ్జల రామకృష్ణా రెడ్డి, వైఎస్ రాజారెడ్డి డిఎన్ఏ ఒకటేనా?

Satyam NEWS

అచ్చేదిన్ అంటే ఇదేనా ? అధిక ధరలతో ప్రజలు చస్తుంటే…

Satyam NEWS

Leave a Comment