ఈ నెల 17, 18 తేదీల్లో ప్రతి పక్షాల ఉమ్మడి మీటింగ్ జరగనుంది. కేంద్రలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బెంగళూరులో ప్రతిపక్షాల రెండో సమావేశం జరగనుంది. బెంగళూరులో జరిగే ఈ సమావేశానికి సోనియాగాంధీ హాజరుకానున్నారు. 24 పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆహ్వాన లేఖలు పంపింది.
గత నెల పాట్నాలో జరిగిన సమావేశానికి 15 పార్టీలు హాజరయ్యాయి. కాగా ఈ సారి బీఆర్ఎస్కు ఆహ్వానం ఉంటుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.