హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఇప్పటివరకు 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల వ్యవధిలో మృతి చెందిన వారి సంఖ్య 50కి చేరిందని తెలిపారు.
హిమాచల్లోని పరిస్థితులపై ఆరా తీసిన కేంద్ర హోం మంత్రి అమిత్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు విజ్ఞప్తి చేశారు.