వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో నేడు పోలీస్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన మొత్తం 6 మంది ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు దారులతో వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ షాకిర్ హుస్సేన్ స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం మూడు భూ ఫిర్యాదులు, రెండు భార్యాభర్తల ఫిర్యాదులు, ఒకటి పరస్పర గొడవల ఫిర్యాదులు వచ్చాయి.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్