గుంటూరు జిల్లా తాడేపల్లిలోని శ్రీ విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో విజయకీలాద్రి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి వారి 60 అడుగుల విగ్రహ శంకుస్థాపన కార్యక్రమాన్ని చిన్న జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి వార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమంలో మై హోమ్, మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు, ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ గోకరాజు గంగరాజు, ముక్కాముల అప్పారావు, ప్రసాద్, పురాణం వెంకటాచార్యులు పాల్గొని స్వామి వారి మంగళాశాసనం అందుకున్నారు.