28.7 C
Hyderabad
April 28, 2024 09: 24 AM
Slider కర్నూలు

మంత్రాలయంలో ప్రేమికుల ఆత్మహత్యాయత్నం: ప్రియుడు మృతి

#Crime Scene

కర్నూలు జిల్లా మంత్రాలయంలో విషాదం చోటు చేసుకుంది. త‌మ ప్రేమ‌ను త‌ల్లిదండ్రులు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్ప‌డ్డారు. ఈ ఘటనలో ప్రియుడు వేణు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో యువతిని ఆస్పత్రికి తరలించారు. వేణు, ఆ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపారు. అయితే వాళ్లు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో వారు మనస్థాపం చెంది నిద్ర మాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించారు. వీరిలో యువకుడు వేణు మృతి చెందాడు. యువతి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువకుడు వేణు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

Satyam NEWS

చారెడు నేలతో పవన్ కల్యాణ్ బతుకు బాట

Satyam NEWS

పోలీస్ రాజ్: కులం వివరాలు అడిగి అరెస్టు చేస్తున్నారు

Satyam NEWS

Leave a Comment