29.7 C
Hyderabad
May 2, 2024 06: 14 AM
Slider గుంటూరు

65 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం.. ఆపై హత్య

#murder

మద్యం మత్తు…. అతడిని చిత్తు చేసింది… కామం ప్రకోపించింది. ఏం చేయాలి? ఏం చేయాలో అదే చేశాడు ఆ తాగుబోతు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. షేక్ మస్తాన్ బి(65) అనే వృద్ధురాలు తన ఇంటి ముందు నిద్రిస్తున్నది.

ఆ ఇంటికి సమీపంలో ఉన్న పెరవలి మణికంఠ అనే యువకుడు మద్యం మత్తులో ఇంటి ముందు  నిద్రిస్తున్న షేక్ మస్తాన్ బి పై అత్యాచారం చేసి అనంతరం దిండుతో ఆమెపై ఒత్తిడి చేసి హత్య చేశాడు. రాత్రి సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా గ్రామస్తులు తెలుపుతున్నారు. 

తెల్లవారుజామున ఇంటి ముందు మస్తాన్ బి  మంచం మీద పడి ఉండడం, శరీరం పై తీవ్రగాయాలు కావటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా వారు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న డి.ఎస్.పి భాస్కర్ రావు,  నరసరావుపేట రూరల్ సిఐ  భక్తవత్సల రెడ్డి, నరసరావుపేట రూరల్ ఎస్. ఐ పి.హజరత్తయ్య,  ఎస్.ఐ  సురేష్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం  డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకొని  మృతదేహాన్ని, పరిసర ప్రాంతాలను  పరిశీలించి అక్కడికి సమీపంలో ఉన్న పెరవలి మణికంఠ ఇంటికి వెళ్లడం జరిగింది.

దీనిపై మణికంఠ విచారించగా అతను తానే ఈ సంఘటనకు పాల్పడినట్లు అంగీకరించాడు. అనంతరం పోలీసులు మణికంఠను  అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాన్ని  పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు.

కాగా మృతురాలి భర్త  షేక్ నన్నే కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ సురేష్ తెలిపారు.

మాదిరాజు రామ్మూర్తి, సత్యంన్యూస్.నెట్

Related posts

జాతీయ రహదారి ఆధునీకరణకు రూ.44 కోట్లు

Satyam NEWS

లాఠీలు పక్కన పెట్టి… ప్లకార్డులు పట్టుకుని “క్లాస్” చెబుతున్నఖాకీలు…!

Bhavani

‘రహదారి’ కవితా సంపుటి ఆవిష్కరణ / అంకితోత్సవం

Satyam NEWS

Leave a Comment