శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాత్రుని వలసలు 74 వ గణతంత్ర దినోత్సవం వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐ డి వి ప్రసాద్ అధ్యక్షతన జరిగినది, జాతీయ పతాక ఆవిష్కరణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఐడివి ప్రసాద్ గావించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయిని బెండి శారద మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ విద్యార్థులందరూ సోదర భావంతో క్రమశిక్షణతో మెలిగినప్పుడే దేశ నాయకులు స్వాతంత్రం తెచ్చిన స్ఫూర్తికి నిజమైన నివాళి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బాణాల గాంధీ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రాజనాల సతీష్ రాయుడు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు