కల్వకుర్తి పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో పాఠశాలలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల్లో స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. 74 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. పండుగలలో కులాలకు మతాలకు సంబంధించినవి ఉన్నను ఈ పండుగను మాత్రం కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండగా. ఈ పండుగకు రంగులతో ముగ్గులు వేసి, ఊరు వాడలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.పట్టణంలోని హైదరాబాద్ నాలుగు కూడలిలో ఉన్న కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ లో విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అనంతరం చదువుల తల్లి సరస్వతి మాతకు వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అక్షరాభ్యాసా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
previous post
next post