తీవ్ర అనారోగ్యంతో మరణించిన పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ పాకిస్తాన్ ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త డాక్టర్ అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆరోగ్యం క్షీణించడంతో మరణించారు. డాక్టర్ ఖాన్ పాకిస్తాన్ అణు కార్యక్రమ పితామహుడిగా చెప్పుకుంటారు. పాకిస్తాన్ను ముస్లిం ప్రపంచంలో మొదటి అణ్వాయుధ సంపన్న దేశంగా తీర్చిదిద్దడంలో ఆయనది ప్రధాన పాత్ర. పాకిస్తాన్ ప్రజలు ఆయనను హీరోగా చూస్తారు.
అణు శాస్త్రవేత్త శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని, ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది. అంతేకాకుండా ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం ప్రవహించడం ప్రారంభమైంది. ప్రముఖ శాస్త్రవేత్త ప్రాణాలను కాపాడటానికి వైద్యులు తమ వంతు ప్రయత్నం చేశారు.