29.7 C
Hyderabad
May 6, 2024 05: 01 AM
Slider నల్గొండ

వలస కూలీల ఆటోను ఢికొట్టిన లారి: ఒకరు మృతి

#Huzur Nagar Constituency Center

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో బీహార్ కు చెందిన వలస కూలీలు హమాలీ పనుల నిమిత్తం ఆటోలో వెళుతుండగా వెనుకనుంచి లారీ తగలటంతో కూలీలందరూ అక్కడికక్కడే క్రింద పడిపోయారు.అందులో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరికీ సీరియస్ గా ఉండడంతో సూర్యాపేట హాస్పిటల్ కి తరలించారు.

గాయపడిన మిగతా 14 మందిని హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ చేర్పించారు.చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరామర్శించి క్షతగాత్రులకు పండ్లు, అల్పాహారం అందజేశారు.


అనంతరం యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ బీహార్ రాష్ట్రం నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చిన వలస కూలీలకు, చనిపోయిన వారి కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని,గాయపడిన క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు బెల్లంకొండ గురవయ్య, చింతకాయల రాము,జక్కుల మల్లయ్య, లచ్చిరెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


సత్యం న్యూస్ ప్రతినిధి హుజూర్ నగర్

Related posts

సొంత ఖర్చుతో బోరు మోటార్ వేయించిన ఎమ్మెల్యే కాలేరు

Satyam NEWS

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ

Satyam NEWS

“ఉజ్జ్వ‌ల భార‌త్ – ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్” పేరుతో విద్యుత్ ఉత్స‌వాలు

Satyam NEWS

Leave a Comment