38.2 C
Hyderabad
April 28, 2024 21: 22 PM
Slider చిత్తూరు

ఒకరి ప్రాణం తీసిన లూడో గేమ్ గొడవ

#ludo game

ఇద్దరి కార్మికుల మధ్య లూడో గేమ్ గొడవ ఒకరి ప్రాణం బలి కోరింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో కోర్టు నూతన భవన నిర్మాణ కార్మికుడిగా దయాళ్ సర్కార్ గత కొన్ని నెలలుగా పొట్ట కూటి కోసం వచ్చాడు.

అతని దగ్గర రోని ఇస్తామ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు మంగళవారం రాత్రి ఇద్దరు కలిసి మొబైల్ లో లూడో గేమ్ ఆడుతూ మనస్పర్ధలు రావడంతో రోని ఇస్లాం దయాల్ సర్కార్ తలపై రాడ్డుతో మోదడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని, వెంటనే వారి బంధువులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, మెరుగైన వైద్యం కోసం అతని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి

తరలిస్తుండగా మార్గ మధ్యంలో మరణించాడని కాగా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి ప్రాణం పోయిందని వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతానికి రోని ఇస్లాం అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు సిఐ చంద్రశేఖర్.

Related posts

9నుంచి బీసీ లకు ఆర్ధిక సహాయం పథకం ప్రారంభం

Bhavani

Analysis: రోత పుట్టిస్తున్న రాతగాళ్ల నైజం

Satyam NEWS

గౌతమ బుద్ధుడి బాట నేటి సమాజానికి ఆచరణీయం

Satyam NEWS

Leave a Comment