29.7 C
Hyderabad
May 3, 2024 04: 35 AM
Slider ముఖ్యంశాలు

ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తోంది: సీపీఐ రామకృష్ణ

#CPI Ramakrishna

‘చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు.అయితే ‘చలో విజయవాడ’ కు అనుమతి లేదంటూ వారిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లో అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీల అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు.

”రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలను ఎక్కడకక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం దుర్మార్గం. ఏపీలో ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోంది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. సీఎం జగన్‌ ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ దుష్ట విధానాలను ఖండించాలి” అని కె రామకృష్ణ పిలుపునిచ్చారు.

Related posts

పంటకు నీరివ్వలేని ఎమ్మెల్యే అవసరమా?

Satyam NEWS

అనుమతి లేకుండా చెట్లు నరికితే చట్ట ప్రకారం చర్యలు

Satyam NEWS

ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్న పార్టీలు

Satyam NEWS

Leave a Comment