ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆనందయ్య కరోనా మందు పంపిణీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రభుతాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
ఆనందయ్య మందు పంపిణీ నిలుపుదలకు సంబంధించి ఆర్డర్స్ ను ఎందుకు తమ ముందుచలేదని ధర్మాసనం ప్రశ్నించింది.
రెండు రోజులు సమయం కోరినప్పటికీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు ఉత్తర్వులు ఉంచలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
15 నిమిషాలలో ధర్మాసనం ముందు ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఆనందయ్య మందు పంపిణీ విచారణ 15 నిమిషాలు వాయిదా వేశారు.
సిగరేట్స్,మందు హానికరం అని తెలిసినా అభ్యంతరం చెప్పని ప్రభుత్వం ఇపుడు ఆనందయ్య మందు పంపిణీకి ఎందుకు అభ్యంతరం చెబుతుందో సమాధానం చెప్పాలని న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు.
ఇప్పటికే ఆనందయ్య మందు హానికరం కాదని కేంద్రం తెలిపినట్టు ధర్మాసనం దృష్టికి ఆయన తీసుకువచ్చారు.