ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి చొరవతో, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరొకసారి దెందులూరు నియోజకవర్గ బీసీ నేతలకు సముచిత స్థానం కల్పించారు. వివిధ ప్రముఖ దేవస్థానాల పాలక మండలిలో చోటు కల్పించారు. విజయవాడ కనకదుర్గ దేవస్థానం లో వేదకుమారి(బిసీ- కొప్పు వెలమ), ద్వారక తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలిలో ముస్సే శ్రీను (మాజీ ఎంపీటీసీ, వేగివాడ) (బిసీ- యాదవ) నియమించారు. దెందులూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు గా వేద కుమారి పని చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వారిరువురికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, సీఎం వైయస్ జగన్ బిసీ వర్గాల వారి అభివృద్ధిని కాంక్షిస్తూ కృషి చేస్తున్నారనడానికి ఈ నియామకాలు నిదర్శనం అని పేర్కొన్నారు.