విశాఖ పెందుర్తిలో ఒక వాలంటీర్ ఘాతుకానికి పాల్పడ్డాడు. 95వ వార్డు సచివాలయం పరిధిలో వాలంటీర్ గా పనిచేస్తున్న వెంకటేష్ సుజాతనగర్ 80 ఫీట్ రోడ్ లో వరలక్ష్మి అనే వృద్ధ మహిళను బంగారం కోసం దారుణంగా హత్య చేశాడు. వెంకట్ 95 వార్డు పురుషోత్తపురంలో వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
నెలరోజుల క్రితం మృతురాలి కొడుకు వద్ద ఫుడ్ కోర్ట్ లో పని నిమిత్తం చేరాడు. రా.10:30 గంటలకు వృద్ధురాలు ఇంట్లో ఉన్న సమయంలో వెంకట్ హత్య చేసి బంగారంతో ఊడాయించాడు. మృతురాలు వయసు సుమారు 72 సంవత్సరాలు ఉంటుంది. వృద్ధురాలు ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి వాలంటీర్ హత్య చేసినట్లు క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.
సిసి ఫుటేజ్ ఆధారంగా అతి స్వల్ప వ్యవధిలో హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని కేజీహెచ్ కు పెందుర్తి పోలీసులు తరలించారు.