దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తొలుత పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
జేపీ నడ్డాకు కండువా కప్పి సన్మానించారు. బీజేపీ జాతీయ కార్యవర్గంలో కొత్త గా బాధ్యతలు తీసుకున్నారు సంజయ్. ఈ మేరకు పార్టీ నూతన జాతీయ ప్రధానకార్యదర్శి రాధామోహన్ అగర్వాల్ తో కలిసి 15 నిమిషాల పాటు నడ్డాతో సమావేశమయ్యారు. జాతీయ నాయకత్వం ఆదేశాల ప్రకారం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బండి వెల్లడించారు.
కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. హైకమాండ్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధమని వెల్లడించారు.