టీవీ సీరియల్ చూడొద్దనందుకు ఒక మహిళ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో చోటు చేసుకొంది. మదనపల్లి పట్టణం శేషప్పతోట కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు బాబు గురువారం కూలి పనులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు.
బాబు ఇంటికి వచ్చిన సమయంలో భార్య సోని (36) టివి సీరియల్ చూసుకుంటూ ఉంది. ఇంట్లో పిల్లలు కొట్టుకుంటున్న కూడా పట్టించుకోకుండా సీరియల్ లోకి లీనమైపోయింది. ఈ పరిస్థితిని చూసిన భర్త బాబు టివిని ఆఫ్ చేసి పిల్లలు కొట్టుకుంటూ ఉంటే సీరియల్ చూసుకుంటూ వున్నావు అని భార్య ను మందలించాడు.
దింతో మస్థాపం చెందిన సోని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్ననికి పాల్పడింది. చికిత్స నిమిత్తం స్థానికి ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.