37.2 C
Hyderabad
May 6, 2024 13: 23 PM
Slider కడప

సీరియల్ చూడొద్దని చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

#crime

టీవీ సీరియల్ చూడొద్దనందుకు ఒక మహిళ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో చోటు చేసుకొంది. మదనపల్లి పట్టణం శేషప్పతోట కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు బాబు గురువారం కూలి పనులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు.

బాబు ఇంటికి వచ్చిన సమయంలో భార్య సోని (36) టివి సీరియల్ చూసుకుంటూ ఉంది. ఇంట్లో పిల్లలు కొట్టుకుంటున్న కూడా పట్టించుకోకుండా సీరియల్ లోకి లీనమైపోయింది. ఈ పరిస్థితిని చూసిన భర్త బాబు టివిని ఆఫ్ చేసి పిల్లలు కొట్టుకుంటూ ఉంటే సీరియల్ చూసుకుంటూ వున్నావు అని భార్య ను మందలించాడు.

దింతో మస్థాపం చెందిన సోని నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్ననికి పాల్పడింది. చికిత్స నిమిత్తం స్థానికి ప్రభుత్వఆసుపత్రికి తరలించారు.

Related posts

అనాధ వృద్ధుడిని ఆశ్రమంలో చేర్పించి మానవత్వం చాటుకున్న డి.ఎస్.ఆర్.ట్రస్ట్

Satyam NEWS

[Professional] Emergency Remedy For High Blood Sugar How To Control Blood Sugar With Black Walnut

Bhavani

బద్వేల్ ఉప ఎన్నిక కు భయపడుతున్న వై సీ పి

Satyam NEWS

Leave a Comment