కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఇక్కడ జగన్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల ను పెంచి పేదవానికి కష్టాలు తెచ్చి పెడుతున్నారని వామపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి.విద్యుత్ భారాలు పెంపు ను నిరసిస్తూ… విజయనగరం దాసన్నపేట ఎస్సీ ఆఫీసు వద్ద వామపక్షాలు నిరసన తెలియజేసాయి.
ఈ సందర్భంగా వామపక్ష నేత తమ్మినేని సీతారాం మాట్లాడుతూ… తక్షణమే జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ మీటర్ల విధానం ను విరమించుకోకపోతే మరో బషీర్ బాగ్ పోరాటం కు సిద్ధపడాల్సి వస్తుందన్నారు. ప్రీపెయిడ్ లాగ…స్మార్ట్ మీటర్ విధానం.. సరైంది కాదన్నారు.
రీచార్జ్ లేకపోతే…. ఫోన్ చచ్చి పోయినట్లు గ…స్మార్ట్ మీటర్ పెట్టుకోకపోతే..సామాన్యుడు నష్ట పోవలసిందేనని సీతారాం స్పష్టం చేశారు. ఈ స్మార్ట్ మీటర్ల విధానం విరమించుకోని పక్షంలో… వామ పక్ష పార్టీ లు…ప్రభుత్వం ఊహించనంతగా…పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు.