40.2 C
Hyderabad
May 2, 2024 15: 15 PM
Slider హైదరాబాద్

కరప్టెడ్ : ఏసిబి కి చిక్కిన శేరిలింగంపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌

acb attack

శేరిలింగంపల్లి సర్కిల్‌ -20 కార్యాలయంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ యాదయ్య, అసిస్టెంట్‌ సాయి కలిసి ఓ వ్యక్తి నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ భవనానికి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్‌ తగ్గిస్తానని చెప్పి యజమాని వద్ద యాదయ్య, సాయి లంచం డిమాండ్‌ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను భవన యజమాని సంప్రదించారు. అయితే గతంలోనే యాదయ్య, సాయి ఆ వ్యక్తి నుంచి రూ. 15 వేలు తీసుకున్నారు. మరో రూ. 15 వేలు ఇస్తేనే ఆస్తి పన్ను తగ్గిస్తామని చెప్పి లంచం డిమాండ్‌ చేశారు. ఆ రూ. 15 వేలు తీసుకుంటుండగా యాదయ్య, సాయిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ చేస్తున్నారు.

Related posts

కొల్లాపూర్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

Satyam NEWS

శనిగకుంట అగ్ని ప్రమాద బాధితులకు గ్యాస్ స్టవ్ ల అందజేత

Satyam NEWS

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

Satyam NEWS

Leave a Comment