ములుగు జిల్లా మం గపేట మండలంలోని శనిగకుంట అగ్ని ప్రమాదం బాధితులకు లయన్స్ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ వివేకానందపురం తరఫున క్లబ్ డైరెక్టర్ లయన్ పింగిలి నాగరాజు ఈ రోజు 39,000/- రూపాయల విలువగల 42 సింగిల్ బర్నర్ గ్యాస్ స్టవ్ లు, 42 నూనె క్యానులు అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, తమ వంట తాము వండుకునే విధంగా చిన్న గ్యాస్ స్టవులు కావాలని బాధితుల కోరిక మేరకు గత శనివారం రోజున 80,000/- రూపాయల విలువైనటువంటి కుటుంబానికి ఒకటి చొప్పున తను ఇచ్చిన 42 నీళ్ల డ్రమ్ములు మరియు 42 టార్పాలిన్ కవర్లకు అదనంగా గ్యాస్ స్టవులు అందజేసినట్టు, అతి త్వరలో వారికి సంబంధించిన మరిన్ని నిత్య ఉపయోగ వస్తువులు ఇవ్వనున్నట్లు నాగరాజు తెలిపారు.