అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో నిందితుడి మృతిపై ఎస్పీ ఫకీరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డును సస్పెండ్ చేశారు. రాయదుర్గంలోని పైతోటలో గొర్రెల చోరీకి ప్రయత్నించాడని ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఆంజనేయులును పోలీసులు అరెస్టు చేశారు.
అతడు నిన్న అర్ధరాత్రి అనుమానాస్పద రీతిలో చనిపోగా.. పోలీసులు గుట్టుగా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.