అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా తుళ్లూరు వద్ద రైతుల ఆందోళన ఉధృతమైంది. రోడ్ల పైనే వారు నేడు వంటా వార్పు మొదలు పెట్టారు. తుళ్ళూరులో ఉదయం ఏడుగంటలకే వాహనాల రాకపోకలు రాజధాని యువకులు అడ్డుకున్నారు.
రైతులు నేడు తలపెట్టిన ధర్నాకి పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండో రోజు బందోబస్తులో ఇద్దరు అడిషనల్ ఎస్ పి లను నియమించారు. ఎనిమిది మంది dsp లు, 15 మంది సిఐ లు, 32 మంది si లు, 600 మంది కానిస్టేబుళ్లతో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు.