వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వైయస్ షర్మిల ఆదేశానుసారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రస్థానం పాదయాత్రకు అబ్జర్వర్ గా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కో- ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డిని నియమించారు.
ఈ సందర్భంగా ఆదెర్ల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో తెరాస ప్రభుత్వం పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు.
షర్మిల చేపట్టిన పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా పాదయాత్రకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అబ్జర్వర్ గా తనను నియమించినందుకు షర్మిల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావడానికి తన వంతుగా నూటికి నూరు శాతం కృషి చేస్తానని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్