నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ తిరుగుబాటే ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దుత్తలూరులో టిడిపి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి తో భేటీ అయ్యారు. భవిష్యత్తు రాజకీయాలపై వీరిద్దరి మధ్య రహస్య చర్చ జరిగిందని అంటున్నారు. వీరిద్దరి తాజా భేటీ తో రాజకీయ మార్పులు వేగంగా జరిగే అవకాశం ఉంది.
ఈ భేటీతో ఉదయగిరి టిడిపిలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని అంటున్నారు. మేకపాటి టీడీపీ నాయకుడు కంభం ని కలవడం చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్యే మేకపాటి టిడిపిలో చేరుతారని ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది.