శరీరమంతా కాలిపోయి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఒక మహిళకు లయన్స్ క్లబ్ ఆర్ధిక సాయం అందించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల గ్రామానికి చెందిన నిరుపేద మహిళ కుమ్మరి కవిత (25) ఇటీవల ప్రమాదవశాత్తు చలిమంటలు అంటుకొని ప్రమాదానికి గురైంది.
ఈ విషయాన్ని సమత ఫౌండేషన్ చైర్మన్ మార్షల్ దుర్గం నగేష్ ద్వారా తెల్సుకున్న లయన్స్ క్లబ్ చైర్మన్ పింగళి నాగరాజు శుక్రవారం బాధితురాలు కవితను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితి అడిగి తెల్సుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కోరారు. తక్షణ ఆరోగ్య ఖర్చులకు 22,500/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
అదే విధంగా దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఈ పేదరాలికి మెరుగైన వైద్యానికి సహాయపడవలసినదిగా కోరారు. వెంటనే స్పందించి సహాయం అందించి నందుకు లైన్స్ క్లబ్ సభ్యులకు పింగళి నాగరాజు కు సొంత ఫౌండేషన్ చైర్మన్ దుర్గం నగేష్ తో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.