టీవీ 5లో పని చేస్తున్న జర్నలిస్టు మూర్తి ఇటీవలి కాలంలో కొన్ని వివాదాలలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ వివాదాలతో పాపులర్ అయిన మూర్తి ఇప్పుడు ఒక చిత్రంలో నటించబోతున్నారని తెలిసింది. వన్ నేనొక్కడినే, 100%లవ్ వంటి సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ప్లే బ్యాక్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ కంపౌండ్ నుంచి వస్తోందని తెలుస్తుంది. ప్రసాద్ రావు పెద్దినేని నిర్మాణ సారధ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. కామ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. సినిమాలో డైనమిక్ గా ఉండే ఆ పాత్రకు కేవలం మూర్తి అయితేనే న్యాయం చేయగలరని భావించిన దర్శకుడు, ఆయన్ను ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఇక ఈమేరకు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా త్వరలో ఓటిటి ఫ్లాట్ ఫామ్ పై విడుదల కానుంది.