సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కో – ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొన్నారు. బంగారు తెలంగాణలో ప్రజల బ్రతుకుదెరువులు ఎలా ఉన్నాయో చూపించడానికే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 95వ,రోజు ఖమ్మం జిల్లా రేపల్లెవాడ గ్రామం నుండి మొదలైందని, రేపల్లె వాడ గ్రామం నుండి మొదలైన పాదయాత్రలో వైఎస్ఆర్ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల తో కలిసి ఆదెర్ల పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు వేధిస్తున్నాయని,నీళ్లు,నిధులు, నియామకాలు కల్పించడంలో కెసిఆర్ ప్రభుత్వం అడుగడుగునా విఫలం అయిందని అన్నారు.
రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేవని తనువు చాలించారని అన్నారు.ఋణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూం ఇండ్లు,నిరుద్యోగ భృతి వంటి పథకాలు అమలు కావడం లేదని, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని ధ్వజమెత్తారు.గ్రామాలు, పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోందని, మహిళలు,చిన్నారుల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయి ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారని ఆరోపించారు.
ఈ క్రమంలో ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు,వారి కష్టాలు తెలుసుకునేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టారని, రాష్ట్రంలో ప్రజా సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలు కనుగొని, వైయస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిల ను ఆశీర్వదించి పూర్తి మద్దతు తెలియజేయాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేవలం వైఎస్ షర్మిల తోనే సాధ్యపడుతుందని అన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్