జగన్ ను నమ్ముకుంటే పదవులకు కొదవ ఉండదు. ఆయనకు విధేయులుగా ఉంటే చాలు… ఆకాశమే హద్దు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నంత కాలం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎంతో విధేయుడుగా ఉన్న ఆదిత్యానాథ్ దాస్ ను రిటైర్ అయిన తర్వాత అందలం ఎక్కించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చెప్పిన పని అంతా చేసిన ఆదిత్యానాథ్ దాస్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడి పదవిని దక్కించుకున్నారు.
ఆయన ఢిల్లీలో ఉండి ఈ పదవి నిర్వహిస్తారు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ పదవిలో నియమితులు కావడంతో భవిష్యత్తులో రిటైర్ అయిన తర్వాత పదవులు కావాల్సిన ఐఏఎస్ లు ఆదిత్యానాథ్ దాస్ బాటలోనే పయనించే అవకాశం ఉంది.
ఆదిత్యానాథ్ దాస్ పదవీ కాలం తదితర వివరాలు నేడు విడుదల చేసిన జీవోఆర్టీ నెం1586లో లేవు. అవి తర్వాత తెలియచేస్తామని అందులో పేర్కొన్నారు.