29.7 C
Hyderabad
May 3, 2024 06: 45 AM
Slider ప్రత్యేకం

కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది…

#ministerharishrao

కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనీ , కల్తీకి పాల్పడే వారి పట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని  ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం  నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబొరేటరీ ప్రాంగణంలో రూ. 2.4 కోట్ల విలువ చేసే 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ బస్సులు, రూ. 10 కోట్లతో అత్యాధునిక పరికరాలతో అప్ గ్రేడ్ చేసిన ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు , ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, ఐపీఎం డైరెక్టర్ శంకర్ లతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన అహర పదార్థాలు అందేలా చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుందన్నారు. బెవరేజేస్, మిల్క్, చిరు ధాన్యాల ఉత్పత్తులు, నూనెలు, మసాల దినుసులు, స్వీట్స్, రెడీ మేడ్ ఫుడ్, ఇతర విభాగాల ల్యాబులను మంత్రి పరిశీలించారు. పరీక్షల విధానం, కల్తీ జరిగే తీరు పట్ల అధికారులను అడిగి తెల్సుకున్నారు.

అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోట్లాది మంది ప్రజల ఆరోగ్యం మన చేతుల్లో ఉందనీ ఈ సందర్భంగా మంత్రి  అన్నారు. కల్తీకి పాల్పడే వారి పట్ల అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలకు నాణ్యమైన అహర పదార్థాలు అందేలా చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహకారం ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తా అన్నారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు చిత్తశుద్దితో పని చేయాలని మంత్రి అన్నారు. కల్తీకి పాల్పడిన వారి పట్ల అధికారులు కటినంగా వ్యవహరించాలన్నారు. అధికారులు నెలవారీ రిపోర్టులు సిద్దం చేసి పంపించాలని సమీక్షలో మంత్రి ఆదేశించారు. సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కల్తీ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ ల సంఖ్యను పెంచామన్నారు. రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయడం తో పాటు, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

జి.హెచ్.ఎం.సి లో ఇప్పుడున్న బస్సుకు అదనంగా ఒకటి,  వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ఒక్కో బస్సును అందుబాటులో ఉంటాయన్నారు. ఆయా జిల్లాల పరిధిలో తిరుగుతూ, ఆహార కల్తీ గుర్తించడం జరుగుతుందనీ, బస్సుల ద్వారా ఆహార కల్తీ పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

సర్ప్రైజ్ విజిట్స్ చేసేందుకు ప్రత్యేకంగా టాస్క్ ఫోర్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పిర్యాదులు రాగానే వీరు వెళ్లి సరైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం ఆహార కల్తీని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నదనీ, ప్రజలు సైతం ఎక్కడైనా కల్తీ జరిగినట్లు సమాచారం ఉంటే.. 040 21111111 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

క్లాప్ వెహికల్ డ్రైవర్ల సమస్యలపై నిర్లక్ష్యo వహిస్తే ప్రతిఘటన

Satyam NEWS

ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలిగేది మార్క్సిజమే

Bhavani

శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థులు పోరాడాలి

Bhavani

Leave a Comment