33.2 C
Hyderabad
May 11, 2024 12: 19 PM
Slider అనంతపురం

అధికార మదంతో మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు

#bjpandhrapradesh

అధికార మదంతో మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు పోలీసు అధికారులను దూషిస్తే ఇప్పటి వరకూ కేసు నమోదు చేయకపోవడం ఏమిటని బీజీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. అదే వేరే రాష్ట్రం లో  అయితే మంత్రి అప్పలరాజు ఈ పాటికి కటకటాల పాలయ్యేవాడని ఆయన అన్నారు. రాష్ట్ర మంత్రి పోలీసు అధికారిని బట్టలు ఉడదీస్తాం అంటే ఇప్పటి వరకు కేసు రిజిస్టర్ చేయలేదని ఆయన అన్నారు. విపక్ష నేతలు లేదా సామాన్యులు ఇలాగా పోలీసులను అని ఉంటే పోలీసులు ఇప్పటికే బట్టలు ఉప్పి కొట్టి జైల్లో పెట్టేవారని ఆయన అన్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతే మీరు ఇక రాష్ట్ర ప్రజలని ఏం రక్షిస్తారు? అని విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  మౌనం వహించడంలో రహస్యం ఏంటి ? అని ఆయన ప్రశ్నించారు. మంత్రిపై పోలీసు కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని  బీజీపీ రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తున్నదని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.

Related posts

కాచిగూడ డివిజన్ లో మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలి

Satyam NEWS

ఏపీ లో పరిశ్రమలకు విద్యుత్‌ కోతలు అమలు

Satyam NEWS

మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసే కుట్ర

Bhavani

Leave a Comment