ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అవినీతిపరుడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మళ్లీ ఆరోపణ చేశారు. కన్నా లక్ష్మీనారాయణ రూ.20 కోట్లకు అమ్ముడు పోయాడని ఆయన అన్నారు. ఇంతకు ముందు తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని విజయసాయిరెడ్డి చెప్పారు.
కన్నా లక్ష్మీనారాయణ లాంటివాళ్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అనర్హులని వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కాణిపాకమే కాదు.. వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తా, అవినీతికి పాల్పడలేదని కన్నా, సుజనా చౌదరి ప్రమాణం చేస్తారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సుజనాచౌదరి.. బోగస్ కంపెనీలు సృష్టించి.. వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.