కడప జిల్లా రాజంపేట పట్టణంలోని 7 వేల నిరుపేద కుటుంబాలకు మంగళవారం నాడు వైసీపీ నేతలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు. రాజంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి అదేశాల మేరకు రాజంపేట పట్టణ వైఎస్సార్సీపీ నాయకులు వీటిని అందజేశారు.
నిత్యావసర వస్తువుల ట్రాక్టర్లను రాజంపేట ఆర్డీవో ధర్మ చంద్రా రెడ్డి, రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి ప్రారంభించారు. రాజంపేట పట్టణానికి చెందిన లాయర్ సుబ్బరామిరెడ్డి, డీలర్ సుబ్బరామిరెడ్డి, కృష్ణారావు,గ్రామాలకు మందరం తంబేళ్ల వేణు గోపాల రెడ్డి, తాళ్లపాక యెగిశ్వరరెడ్డి,వడ్డె రమణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంకా పైదర్,చిదానంద గౌడు,కసిరెడ్డి చిన్న, గల్జార్ బాషా, మీసాల వెంకటసుబ్బయ్య, కలిల్, అప్సర్, ఖాజమెద్దిన్, రఘు యాదవ్, చప్పిడి రఘు నాధరెడ్డి, అశోక్, దళిత రత్నఅవార్డు గ్రహిత రామకృష్ణ ,జావిద్,మసూద్, అన్నపూర్ణ మరళి, పసుపులేటి సుధాకర్ తదితరులు ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.