42.2 C
Hyderabad
May 3, 2024 15: 34 PM
Slider నల్గొండ

కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పొరాడే నేత నాగన్నగౌడ్

#intuc

ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు.  

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ 50వ, జన్మదినాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్లు,బ్రెడ్ పంపిణీ చేశారు.హుజూర్ నగర్ మండల ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ కార్మికులు పాల్గొని నాగన్న గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కార్మిక,రైతు శ్రేయస్సు కోసం నిరంతరం పేదల సమస్యలపై పోరాటం చేసే నాయకుడు నాగన్న జన్మదిన వేడుకలు జరుపుకోవడం తమకి ఆనందంగా ఉందని,కార్మికుల దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్, మాజీ అధ్యక్షుడు కస్తాల రవీందర్, రెడపంగు రాము,జక్కుల శ్రీను,చిట్టి బాబు రేఖ వెంకటేష్ ,సైదావలి,అక్బర్,గోవిందు, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

Development agenda :నిజంగా కమల్ హసన్ లోకనాయకుడే

Satyam NEWS

రిక్వెస్ట్: పిటిఐల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

Satyam NEWS

కలమే నిజమైన జర్నలిస్టులకు బలం….బలహీనత

Satyam NEWS

Leave a Comment