సెప్టెంబర్ 1 నుండి చేపట్టే అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తనిఖీ. ఈ సందర్భంగా ఆర్మీ సబ్ మేజర్ శిర్జి లాల్ జల్ తో కావాల్సిన ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశ రాత పరీక్ష ఆన్లైన్ ద్వారా నిర్వహించగా 7397 మంది అభ్యర్థులు ఎంపికైనారని, వీరికి రెండో దశలో శారీరక, వైద్య పరీక్షలు సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతాయన్నారు. బ్యారికెటింగ్ ఏర్పాట్లు, టాయిలెట్ల ఏర్పాటు చేయాలన్నారు.
ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, కావాల్సిన వైద్యులు, అత్యవసర మందులతో సిద్ధంగా ఉంచాలన్నారు. అభ్యర్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.