బిచ్కుంద మండలంలోని చిన్న దడిగి గ్రామంలో రైతు అవగాహన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి పోచయ్య మాట్లాడుతూ రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం వ్యవసాయ శాఖ కాలమానిని రైతులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారితో పాటు సర్పంచ్ అనిత విట్టల్ రెడ్డి. గ్రామ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు విట్టల్ రెడ్డి, నాయకులు కిష్టారెడ్డి పంచాయతీ కార్యదర్శి రాజరత్నం ఏఈవో పండరి, గ్రామ రైతులు పాల్గొన్నారు.