హోమ్ గార్డులకు నివేశన స్థలాలు ఇచ్చేందుకు గుంటూరు జిల్లా నరసరాపుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేశారు. ఇక్కడ ఉండి విధులు నిర్వహిస్తూ సొంత స్థలాలు కానీ ఇల్లు కానీ లేక గత కొన్ని ఏళ్లుగా అద్దెకు ఉంటున్నామని హోమ్ గార్డులు తమ సమస్యను ఎం.ఎల్.ఏ దృష్టి కి తీసుకొనివెళ్లారు.
వెంటనే స్పందించిన శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 75 మంది హోమ్ గార్డులకు నివేశాన స్థలాలు మంజూరు చేస్తాం అని హామీ ఇచ్చారు. తమ విషయం లో సానుకూలంగా స్పందించిన శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.