37.2 C
Hyderabad
May 6, 2024 14: 25 PM
Slider వరంగల్

అక్షర భారత్ విద్యా ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికి విద్య

#akshara bharat

అక్షర భారత్ విద్యా ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విద్య ప్రాజెక్ట్ సెంటర్ ను నేడు వరంగల్ రూరల్ జిల్లాలో ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి మున్సిపల్ వైస్ చైర్మన్ రేవూరు జైపాల్ రెడ్డి హాజరు కాగా ఎంసిఓ శ్రీపతి రాజు, సెంటర్ కో-ఆర్డినేటర్ ప్రవల్లిక  పాల్గొన్నారు.

నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ఈ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని, విద్యాబుద్ధులు నేర్చుకుని, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని వారు  పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో  పరకాల స్థానిక కౌన్సిలర్ రామన్న, వార్డు  సభ్యులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమ్మానాన్నలను వేధిస్తున్నాడని తమ్ముడి హత్య

Satyam NEWS

ఘనంగా రుక్మిణీ, సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం

Satyam NEWS

పెండింగ్ ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను చెల్లించాలి

Satyam NEWS

Leave a Comment