అక్షర భారత్ విద్యా ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విద్య ప్రాజెక్ట్ సెంటర్ ను నేడు వరంగల్ రూరల్ జిల్లాలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి మున్సిపల్ వైస్ చైర్మన్ రేవూరు జైపాల్ రెడ్డి హాజరు కాగా ఎంసిఓ శ్రీపతి రాజు, సెంటర్ కో-ఆర్డినేటర్ ప్రవల్లిక పాల్గొన్నారు.
నిరక్షరాస్యతను రూపుమాపేందుకు ఈ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని, విద్యాబుద్ధులు నేర్చుకుని, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పరకాల స్థానిక కౌన్సిలర్ రామన్న, వార్డు సభ్యులు నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.