హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే యం.జి.యన్.ఆర్.ఈ. జి.ఎస్.పనులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు డిమాండ్ చేశారు.
కడప జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యం.జి.యన్.ఆర్.ఈ. జి.ఎస్.పనులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతిస్తున్నామన్నారు.
రెండున్నర సంవత్సరాల 34 రకాలు పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు అందక రోడ్ల పాలు అయ్యారని,ఒకటిన్నర సంవత్సరం క్రితం కోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు.
ఇప్పటికయినా బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.