జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పాటు పెండింగులో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులను వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రోజు డీఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
పాఠశాలలు మూతపడిన ప్రభుత్వ ఉపాధ్యాయులుకు వేతనాలు అందిస్తున్నారు వారిలాగానే చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం ఇచ్చే గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వివిధ డిమాండ్లు తో కూడిన వినతి పత్రం కార్యాలయంలో సూపరింటెండెట్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి బాల్ రామ్ మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు వెంకటయ్య, రవి మణెమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు.